Wednesday, May 8, 2024

సీహెచ్ కొండూరు లక్ష్మీనరసింహ ఆలయ పునఃప్రారంభోత్స‌వ వేడుకలు..

నిజామాబాద్ : సీహెచ్ కొండూరు లక్ష్మీనరసింహ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత దంపతుల ఆధ్వర్యంలో ఆలయ పునఃప్రారంభం వేడుకలు వైభ‌వంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి దంపతులు, ఎంపి సంతోష్ కుమార్ దంపతులు, నిజామాబాద్ సీపీ నాగరాజు లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి దంప‌తుల‌కు జ్ఞాపికను అంద‌జేసి ఘ‌నంగా స‌న్మానించారు. ఆల‌య పునః ప్రారంభోత్స‌వ వేడుక‌లో భారీగా భ‌క్తుల రద్దీ నెల‌కొంది, స్వామి వారి దర్శానికి భక్తులు బారులుతీరారు. గోవింద నామస్మరణతో చౌడమ్మ కొండూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మారుమోగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement