Friday, May 3, 2024

ఓటు వెయ్యండి….లక్ష పొందండి -ఖుష్బూ

ఎన్నికలు వచ్చాయంటే… రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కొత్త… కొత్త హామీలు వింత చేష్టలు అన్ని బయటకు వచ్చేస్తాయి. మాకు ఓటు వేస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రచారంతో ఊదర కొడతారు. ప్రస్తుతం తమిళనాట నాయకులు ఇదే పని చేస్తున్నారు. తాజాగా సినీ నటి ఖుష్బు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తనదైన శైలిలో ఓ హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే ఆడపిల్ల అకౌంట్లో వేస్తాం అంటూ హామీ ఇచ్చారు.

కాగా బిజెపి అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఖుష్బూ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఈ హామీని ఇచ్చారు. ఆర్థికంగా మహిళలు బలంగా ఉండాలని ఆర్థిక స్వాతంత్ర్యం అవసరమని అందుకే తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే వెంటనే వారి పేరుమీద లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మరి కుష్బూ ఇచ్చిన హామీ ఎంతవరకు ఆమెను ఈ ఎన్నికలలో ముందుకు తీసుకు వెళుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement