Saturday, April 20, 2024

కమలాపూర్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు పరుశరాములు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా గద్దె వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం ఎన్టీరామారావు చిత్రపటానికి పూలమాల వేశారు. 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలు అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు ఎన్టీరామారావు చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు పరిపాలన ఎంతో సౌలభ్యంగా కొనసాగిందని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి ఏనాటికైనా పూర్వవైభవం రావడం ఖాయమని ఈ సందర్భంగా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పెరుమాండ్ల పరుశరాములు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిడిపి నాయకులు కస్తూరి ముత్యాలు ,బండి రాజా కిషోర్, అలాటి ధర్మరాజు ,శిల్పాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement