Thursday, April 25, 2024

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది…

కరీమా బాద్ – ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో 10,67500/- రూపాయల విలువ చేసే 32మంది లబ్ది దారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అందజేసారు.ఎలాంటి పైరవీకి తావులేకుండా నేడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని,పేదలకు ముఖ్యమంత్రి సహాయనిది సాయం ఎంతో ఉపకరిస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పోరేటర్లు కేదల పద్మ మరు పల్ల భాగ్యలక్ష్మి రవి, దామోదర్ యాదవ్ వేణుగోపాల్ ,బిసీసెల్ అధ్యక్షుడు సామంతుల శ్రీనివాస్ శ్రీరామ్ రాజేష్ ,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement