Saturday, April 27, 2024

కరోనాతో బీహార్ సీఎస్ కన్నుమూత

బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరుణ్ కుమార్ సింగ్ కరోనా బారిన పడి మరణించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇటీవలే పాట్నాలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం కన్నుమూశారు. 1985వ బ్యాచ్‌కు చెందిన బీహార్ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన అరుణ్ కుమార్ పశ్చిమ చంపారన్ నివాసి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆయన బీహార్‌కు సీఎస్‌గా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31తో ఆయన పదవీకాలం ముగియనుంది. కాగా అరుణ్ కుమార్ సింగ్ మృతిపై సీఎం నితీష్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను జరపనున్నట్టు సీఎంవో ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement