Friday, April 26, 2024

సినిమాలు లేక గురువు దగ్గరికే వెంకీ కుడుముల ?

ఛలో, భీష్మ చిత్రాలతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీష్మ సినిమా తరువాత ఇప్పటి వరకు కూడా తన తరువాత సినిమాను ప్రకటించలేదు. అయితే ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని వెంకీ మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తాను అనుకున్న హీరోలంతా కూడా ప్రస్తుతం వారివారి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు కరోనా కారణంగా సినిమా షూటింగులు కూడా ఆగిపోతున్నాయి. కొత్త ప్రాజెక్టులు ఇప్పడు స్టార్ట్ అయ్యేలా కనిపించట్లేదు.

ఈ నేపథ్యంలోనే వెంకీ కుడుముల తన గురువు మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి అందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement