Wednesday, May 8, 2024

కూలీలపై తేనెటీగల దాడి.. 50 మందికి గాయాలు

కుక్కునూరులోని కొత్త చెరువు దగ్గర పని చేస్తున్న ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో యాభై మంది వరకు కూలీలకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలియగానే వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి నాగేంద్ర హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆన్లైన్లో జిల్లా కార్యదర్శి రవితో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. అలాగే ఏపీవోతో, ఎంపీడీవోతో మాట్లాడి గవర్నమెంట్ డాక్టర్ తో మాట్లాడి బాధితులకు తొందరగా వైద్య సదుపాయాలు అందించాలని నాగేంద్రరావు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రవి కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement