Saturday, April 27, 2024

ఆర్టీసీ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యాన్ని ఏపీఎస్ ఆర్టీసీ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతిరోజూ వెయ్యి దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌లో తిరుపతి బస్సుకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లిస్తే తిరుమల శ్రీవారి శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు.

కాగా ఆర్టీసీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రతి రోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఆకాశాన్ని అంటిన పెట్రోల్ ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement