Saturday, April 27, 2024

Delhi | ఢిల్లీలో ప్రపంచ పర్యావరణ సదస్సు.. పాల్గొన్న ఏపీ అధికారులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సులో ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి మైదాన్‌లో సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు  మూడు రోజుల పాటు జరగనుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఐఏఎస్ రాజన్ చిబ్బర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement