Friday, April 26, 2024

ఈనెల 16 నుంచి ఏపీలో ఇంటర్ కాలేజీలు ప్రారంభం

ఏపీలో ఇంటర్మీడియట్ తరగతుల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. కరోనా కారణంగా గతంలో ఇంటర్ కాలేజీలు మూతపడ్డాయి. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం.. ఇంటర్ క్లాసులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రత్యక్ష తరగతులను ఆగస్టు 16 నుంచి ప్రారంభించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్నీ ఆ రోజు తెరుచుకుంటాయని, కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని ఆదేశించారు. కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఇటీవలే అందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ సెకండియర్‌కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: జర్నలిజం చదివిన వారికి శుభవార్త

Advertisement

తాజా వార్తలు

Advertisement