Friday, April 19, 2024

జర్నలిజం చదివిన వారికి శుభవార్త

జర్నలిజం చదివి.. జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి శుభవార్త. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో పలు ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి అవకాశం ఉంది. దరఖాస్తు చేయడానికి ఈనెల 12 చివరి తేదీ.

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. తెలుగు- 5, హిందీ- 9, ఇంగ్లీష్- 3, పంజాబీ- 3, ఒడియా- 3, బెంగాలీ- 1, మరాఠీ- 5, గుజరాతీ- 1, అస్సామీ- 2, మణిపూరి- 2. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిగ్రీ పాస్ కావాలి. అలానే పదో తరగతి సంబంధిత భాషలో చదివి ఉండాలి. అలానే రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ నుండి దరఖాస్తు చేసుకోవాలి.

ఈ వార్త కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement