Wednesday, May 8, 2024

ఏపీలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు ఊరట కలిగించింది. రంజాన్ పండుగ, ఉప‌వాస దీక్ష‌ల సంద‌ర్భంగా ముస్లిం ఉద్యోగులు ఏప్రిల్ 14 నుంచి మే 13 వ‌ర‌కు ఉద్యోగులు ఒక గంట పాటు ముందే ఉద్యోగం నుండి ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమ‌తి జారీ చేసింది. ఉప‌వాస దీక్ష‌ల సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు ఇబ్బందిక‌ల‌గ‌కుండా ఉండేందుకే ఈ నిర్ణ‌యం అని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులో పేర్కొంది. రాష్ట్రంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి భారీగా ఉన్నందున ఉద్యోగులు తప్పనిసరిగా క‌రోనా ఆంక్ష‌ల‌ను పాటిస్తూ పండుగ జ‌రుపుకోవాల‌ని ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement