Thursday, April 18, 2024

ఏటీఎంలలో చిరిగిన నోటు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏటీ-ఎంలలో చిరిగిన నోటు- వచ్చింది. సోమవారం పెద్దపల్లికి చెందిన ఖాజా అత్యవసర పరిస్థితుల్లో పెద్దపల్లి పట్టణంలోని మజీద్‌ దగ్గర గల ఏటీ-ఎంలో రూ. 5వేలను డ్రా చేయగా, అందులో చిరిగిన రూ. 500 నోటు- వచ్చింది. దీంతో బాధితుడు ఈ సమస్యను ఎవరి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయారు. అధికారులు ఏటీ-ఎంలలో డబ్బులు పెట్టేపుడు చిరిగిన నోటు-్ల లేకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడితోపాటు ఖాతాదారులు, ప్రజలు పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement