Friday, April 26, 2024

జగన్ బెయిలు రద్దు చేయండి: RRR పిటిషన్

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. నిత్యం వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు చేసే రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఓ అడుగు ముందకేసి సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ తాజాగా ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ తో పాటు పలు పత్రాలను కోర్టుకు ఆయన సమర్పించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 ఛార్జ్ షీట్లను నమోదు చేసిందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అన్ని ఛార్జ్ షీట్లలో ఆయన ఏ-1గా ఉన్నారని తెలిపారు. జగన్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, తమ పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement