Wednesday, May 1, 2024

AP: ప‌వ‌న్ కు మ‌ద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం పిఠాపురంలో ఇప్పటికే నాగబాబు, జానీ మాస్టర్, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారానికి రానున్నారు.

చేబ్రోలు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారన్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారని తెలిపారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని అజయ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పంచకర్ల సందీప్, జ్యోతుల శ్రీనివాస్, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement