Sunday, April 28, 2024

తిరుమల కొండల్లో రోడ్డుప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రోడ్డు క్లీనింగ్ మిషన్ లారీని వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు గాయపడటంతో వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా రోడ్డుప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో ఒక కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement