Monday, April 29, 2024

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఓదెల: మండలంలోని హరిపురం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో 3 వేల కోట్లతో 3లక్షల గొర్రెల యూనిట్లు యాదవులకు పంపిణీ చేస్తామని ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో 29 రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎక్కడా చేయని విధంగా కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి యాదవులు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గుండేటి ఐలయ్య యాదవ్‌, యాదవ సంఘం నాయకులు అమ్ముల భిక్షపతి యాదవ్‌, గుండేటి మొండయ్య యాదవ్‌, మద్దెల గట్టయ్య యాదవ్‌, బండి తిరుపతి యాదవ్‌, ఈద లక్ష్మయ్య యాదవ్‌, బండి మొండయ్య యాదవ్‌, బండారి రాజయ్య యాదవ్‌, పోచమల్లు యాదవ్‌, గుండేటి లక్ష్మయ్య యాదవ్‌, గుండేటి మల్లయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement