Thursday, April 25, 2024

బ్రహ్మంగారిమ‌ఠం హుండీ ఆదాయం రూ.21 ల‌క్ష‌లు..

బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠం లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో హుండీల లెక్కింపు ద్వారా 21 ల‌క్ష‌ల 87వేల 754 రూపాయలు మఠానికి ఆదాయము వచ్చినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ పేర్కొన్నారు. మఠం ప్రాంగణము నందు ఏడో తరం మఠాధిపతులు శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో వేద పాఠశాల విద్యార్థులు, భక్తులతో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి తెలిపారు. మూడు నెలలపాటు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన ఈ ఉండి లెక్కింపులో ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement