Saturday, April 27, 2024

టీచర్ల బదిలీలకు 59,909 దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్ల బదిలీల ప్రక్రియ ముగిసింది. వివిధ జిల్లాలకు బదిలీలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 59,909 మంది టీచర్లు బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. బుధవారంతో గడువు ముగియడంతో బదిలీల దరఖాస్తుల వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు.

గురువారం టీచర్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టారు. రెండుమూడ్రోజుల్లో సీనియారిటీ లిస్టును అందుబాటులో ఉంచనున్నారు. అయితే నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా బదిలీలు కోరుతూ 3649 దరఖాస్తులు పాఠశాల విద్యా అధికారులకు అందాయి. అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి 423 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement