Saturday, April 27, 2024

దేశంలో రెండు కోట్లకు చేరువలో కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,68,147 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,99,25,604కు చేరాయి. రెండు రోజుల క్రితం రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకుపైగా నమోదవగా, అవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు దిగువనే నమోదయ్యాయి. కాగా వరుసగా ఐదోరోజు కూడా మూడు వేలకు పైగా మరణాలు రికార్డవడం గమనార్హం. అయితే తాజాగా 3.6 లక్షల కేసులు నమోదవడంతో .ఇందులో 16,29,3003 మంది బాధితులు కోలుకోగా, 34,13,642 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 15,71,98,207 మందికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement