Friday, March 29, 2024

మహానటితో అర్జున్ రెడ్డి ?

అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం విజయదేవరకొండ మహానటి కీర్తి సురేష్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట.

ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతుందట. గతంలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కీర్తిసురేష్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత పరశురామ్ విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement