Saturday, April 27, 2024

జాతి రత్నాలు Vs గాలి సంపత్… గెలుపు ఎవరిది?

మార్చి 11న ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రారంభమై ఒక్కసారిగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని రిలీజ్‌కు సిద్ధమైన చిత్రం ‘జాతి రత్నాలు’. నాగ్ అశ్విన్ నిర్మాత కావడం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి నటించడంతో పాటు ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ప్రమోషన్‌లలో పాలుపంచుకోవటం ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. యూత్‌ను ప్రధానంగా టార్గెట్ గా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది.

మరోవైపు శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఆయన సమర్పణలో వస్తోన్న ఈ సినిమాకు ఆయనే స్క్రీన్‌‌ప్లే అందించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎస్.కృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమా మాత్రం కథనే నమ్ముకుని ఉంది. ఇక మొదటి నుంచి కూడా శ్రీ విష్ణు వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కథ కూడా బాగానే ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో కూడా కథ బాగుంటే నా పాత్ర ఎలా ఉన్నా సినిమా చేస్తానని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement