Monday, May 6, 2024

అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేఏపాల్ పిటిషన్

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్  చేస్తూ ప్రముఖ పాస్టర్ కేఏ పాల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరించాలనే కేంద్ర నిర్ణయం బాధాకరమన్నారు. డిజిన్వెస్ట్ మెంట్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది ఉపాధి కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా  కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement