Wednesday, May 15, 2024

అమరావతి : మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో ఊరట

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకూ మంత్రి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్ఈసీ డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో ఆ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు ఆయన మీడియాతో6 మాట్లాడకూడదన్న ఆదేశాలను మంత్రం సమర్ధించింది. దీంతో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశా3లపై పెద్దరెడ్డి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. పెద్దిరెడ్డి పిటిషన్పై ఈ రోజు విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆయన మీడియాతో  మాట్లాడేందుకు అనుమత ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియపైనా, ఎస్ఈసీ, కమిషనర్ పైనా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదని షరతు విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement