Thursday, May 16, 2024

సాగ‌ర్ లో కెసిఆర్ ఎన్నిక‌ల స‌మ‌ర శంఖం…13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు శ్రీకారం..

న‌ల్ల‌గొండ : నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో కెసిఆర్ ఎన్నికల స‌మ‌ర శంఖాన్ని పూరించారు. దీనిలో భాగంగా ఆయ‌న నేడు నాగార్జున సాగర్‌ నియోజకర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ముందుగా నెల్లికల్ వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ర‌వీంద్ర నాయ‌క్‌తో పాలు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నారు. కాగా మ‌రికొద్ది సేప‌టిలో కెసిఆర్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement