Tuesday, May 14, 2024

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి.. సప్తమ వార్షికోత్సవాలు

ఏలూరు టౌన్, ప్రభ న్యూస్.. స్థానిక 42వ డివిజన్ కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షికోత్స సందర్భంగా ఆలయ పున ప్రారంభ నుండి ఇప్పటివరకు గుడికి సహకరిస్తున్న గురువులైన కీర్తి శ్రీను ,మారిశెట్టి ప్రభావతి, ఉగ్గిన భవానీ లకు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాలతో సత్కరించారు.. తదుపరి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కోలాట బృందానికి చిరతలు, మెమొంటోలు ,స్వామి వారి సాలువతో బాలలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి గోవింద నామ స్మరణలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోట సత్యకోట సత్య ప్రకాశార్యులు విశేష పూజలు జరిపించి భక్తులను దీవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement