Monday, April 29, 2024

Breaking : గూడ్స్ ట్రాలీ- స్కూటీ ఢీ.. మహిళ మృతి

గూడ్స్ ట్రాలీ..స్కూటీ ఢీకొన్నాయి. ఈప్ర‌మాదంలో ఓ మ‌హిళ మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న వరంగల్ జిల్లా నర్సంపేట-నెక్కొండ రహాదారిపై చోటు చేసుకుంది. ఈర్యా తండాకు చెందిన రాజు అనే వ్యక్తి తన గూడ్స్ ట్రాలీ నడుపుకుంటూ నర్సంపేటకు వెళ్తుండగా …గూడూరుకు చెందిన మహిళ తన ద్విచక్రవాహనంపై నర్సంపేట నుండి గూడూరు వెళ్తుండగా.. చర్చి సమీపాన గూడ్స్ ట్రాలీని స్కూటీ ని ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై ఉన్న మహిళ స్పాట్ లోనే చనిపోయింది.ట్రాలీ డ్రైవర్ కు కాలు విరిగినట్లు సమాచారం.ఈ ప్రమాద సమయంలో గూడ్స్ ట్రాలీ డ్రైవర్ స్పీడ్ గా నడుపుకుంటూ వెళ్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement