Saturday, May 25, 2024

రామానుజ సమారోహానికి పీఠాధిపతులకు ఆహ్వానం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: త్రిదండి చినజీయర్‌ స్వామి నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి విశాఖ శారదా పీఠాధిపతులను ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం చిన జీయర్‌ స్వామి తరపున అష్టాక్షరీ జీయర్‌ స్వామి చినముషిడివాడలోని పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఫిబ్రవరి నెలలో భారీ ఎత్తున తలపెడుతున్న సహస్రాబ్ది సమారోహంలో పాల్గొనాల్సిందిగా కోరారు. అంతకుముందు త్రిదండి చినజీయర్‌ స్వామి ప్రతినిధులను విశాఖ శ్రీ శారదాపీఠం మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది. పీఠం ప్రధాన ద్వారం వద్ద వేద విద్యార్థులు గురువందనం సమర్పిం చారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి అష్టాక్షరీ జీయర్‌ స్వామిని రాజశ్యామల అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement