Saturday, April 27, 2024

గిరి రూపంలో ఉన్న దేవుడే… అరుణాచలం!

‘అరుణాచలం’ అనే పదానికి ఎవరి అవగాహనను బట్టి వారు అనేక అర్ధాలను చెప్పుకున్నారు.
అరుణాచలం అంటే ఆగమ ప్రధానులు అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్ఠింపబడిన శివలింగం.
పౌరాణికులకు అరుణాచల పర్వతం భక్తులకు శివ స్వరూపం.
యోగులకు పరంజ్యోతి దానికి అతీతం కూడా.
జ్ఞానోపాసకులకు హృదయస్తుడైన పురుషుడు.
నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి.
భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీన మైన కొండ ఇలా ఎన్నో… ఎన్నెన్నో అర్థాలను చెబుతున్నారు. కానీ…
భగవాన్‌ శ్రీ రమణ మహర్షి వాక్కుల కు వేరే ప్రమాణముల ఆవశ్యకత లేదు. వారు అనేక పర్యాయములు అరుణాచలం గురించి ప్రస్తావించడం జరిగింది. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే అన్నారు. ఈ క్షేత్రములో ప్రతి శిలా శివలింగమే. ఈ క్షేత్రములో తీసుకొన్న ఆహారము, నీరు అమృతమే. ఈ క్షేత్రములో ఏమి మాట్లాడుకున్నా శివ స్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే. గిరి ప్రద క్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరిచుట్టూ ఉన్న 24 మైళ్ళలోపు ఎక్కడ మరణించినా వారికి ముక్తి కలుగుతుంది. కమలాలయమును తిరువారూర్‌ నందు జన్మించినచో ముక్తి కలుగుతుంది. అలాగే కాశీ క్షేత్రములో మరణిస్తే ముక్తి కలుగుతుంది. కానీ అరుణాచలములో పుట్టడం, మరణిం చడం జరిగితే ముక్తి కలగడంతోపాటు అరుణాచలమును స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది. దీనిని బట్టి అరుణాచలం ఎంత గొప్ప విశిష్టత కలిగిన క్షేత్రమో తెలుస్తున్నది. మిగిలిన అన్ని గిరులను ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించారు. అరుణాచలాన్ని మాత్రం గిరి రూపంలో నున్న దేవుడే అంటారు. మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్లే పరమ శివుడు ఈ కొండతో తాదాత్యము చెందాడు. అందువల్ల ఈ కొండ పరమశివుడే. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనపడాలని శివుడు కొండ రూపం దాల్చాడు.

ఓం నమ:శ్శివాయ!
సేకరణ: దైతా నాగపద్మలత
9502734852

Advertisement

తాజా వార్తలు

Advertisement