Thursday, April 25, 2024

Accident: బోల్తా పడిన బొలెరో.. 15 మందికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీ రంగాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ పాలుట్ల రంగస్వామి దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. కోడుమూరు గ్రామానికి చెందిన రాధ అనే మహిళ మృతి చెందింది. బంధువులతో కలసి కార్తీక అమావాస్య కావడంతో స్వామివారి దర్శనానికి వెళ్తున్న సమయంలో శ్రీ రంగాపురం గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement