Sunday, May 19, 2024

కర్ణుడికీ తప్పని ఆకలి బాధ!

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాప పుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యం త దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గ లోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. సమీపం లో ఉన్న కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకుని నోటి ముందుకు చేర్చుకుని ఆత్రం గా త్రాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కా స్తా బంగారు ద్రవంగా మారి త్రాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అంతే అయింది. ఈలోగా విపరీ తమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురు గా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప చేయడంతో వెంటనే పండు కొరికాడు. పం డు కాస్తా పంటి కింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్లిd అదే అనుభవం ఎదురయింది. ఏది తిన్నా, ఏది త్రాగబోయినా మొత్తం బంగారు మయంగా మారిపోతున్నాయి. తప్పితే ఆకలి, దాహం తీరడంలేదు. దానితో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు-
”కర్ణా! నీవు దానశీలిగా పేరుపొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం, వెండి, ధనం రూపేణా చేశావు. కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది” అని అశరీరవాణి పలికింది.
అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు తనను ”ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది మహారాజా! ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో” అని నోరు తెరిచి అడిగాడు కూడా. అయితే అపార ధనవంతుడను, అంగరాజ్యాధిపతిని అయిన నేను పేదసాదలకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలు గురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణలను తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మోయలేక అతను అక్కడే చతిగిలబడ టం, తాను తిరస్కారంగా చూసి భటుల చేత గెంటించడం గుర్తుకొచ్చింది. బంగారం, వెండి, ధనం, వజ్రవైఢూర్యాలను దానం చేయడమే గొప్ప వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడు అనే పేరు వచ్చింది. ఎవరైనా పెడతారు. ఇక తన గొప్పేముంది? అని ఆలోచించాడు కానీ, ఆకలి అన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బ్రతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్ర మాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తుకొచ్చాడు. సూర్యుని వద్దకు వెళ్లి జరిగిన విషయం అంతా వివరించి పరిపరివిధాల ప్రాధేయపడ్డాడు.
సూర్యుడు తమ రాజైన మ##హంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కలిసి ఆలో చించుకుని కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకా నికి వెళ్లి అక్కడ ఆర్తులందరికీ అన్నసంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దానితో కర్ణుడు భూలోకా నికి భాద్రపద బహుళ పాడ్యమినాడు వెళ్లి అన్నసంతర్పణ చేశాడు. ఇతరులకు తర్పణలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికి వెళ్ళాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న కాలానికి మహాలయ పక్షమని పేరు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులో నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి దప్పిక ఆయనని ఎన్నడూ బాధించలేదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి కడుపు నింపాలి కానీ, డబ్బు, బంగారం దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? అన్నం పెట్టి ఆకలి తీర్చిన వారిని ”అన్నదాతా సుఖీభవ” అని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. పితృదేవతల పేరిట ఆలయాలలో అన్నదానం చేయించడం వల్ల పేదల కడుపు నిండుతుంది. పితృలోకంలో ఉన్న వారికి ఆత్మ శాంతి కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement