Saturday, May 4, 2024

Breaking : ఏసీబీ వలకు చిక్కిన.. అవినీతి చేపలు

హజీపూర్ (ప్రభన్యూస్): మంచిర్యాల జిల్లా ఆరోగ్య శాఖలో అవినీతి చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దాడులు చేసి అవినీతికి పాల్పడిన ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్ హెచ్ ఎం స్కీం కింద అద్దె కార్లను నడుపిన సదరు కారు యజమాని ఆరు నెలల బిల్లుల చెల్లింపు విషయమై అధికారులను కోరాడు. బిల్లల చెల్లింపు జరగాలి అంటే లంచం చెల్లించాలని అధికారులు డిమాండ్ చేయడంతో కారు యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అధికారుల సూచన మేరకు మంగళవారం డబ్బులు ముట్టజెప్పేందుకు కారు యజమాని కార్యాలయానికి రాగా అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ తతంగం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement