Tuesday, May 21, 2024

ఓజీలో శ్రియా రెడ్డి.. వెల్ క‌మ్ చెప్పిన మూవీ టీం

న‌టి శ్రియారెడ్డి త‌మిళంతో పాటు ప‌లు తెలుగుచిత్రాల్లో న‌టించింది. కాగా ఈమె యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఓజిలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌. ప్రస్తుతం జరుగుతున్న షూటింగులోకి ఆమెకి వెల్ కమ్ చెబుతూ, ఆమెకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రియా రెడ్డి ఎవరో కాదు .. హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య. గతంలో కొన్ని తమిళ సినిమాల్లో .. ఒకటి రెండు తమిళ సినిమాల్లో ఆమె నటించింది. సలార్’ సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్న శ్రియా రెడ్డి, ‘OG’లోను ఛాన్స్ కొట్టేసింది. ఈ కథ 1950 కాలంలో .. ముంబై నేపథ్యంలో కొనసాగుతుందట‌. ఈ చిత్రంలో హీరోగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్నారు. ఆయ‌న‌కి జోడీగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement