Wednesday, May 8, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వెలుపల కూడా భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 74,304 మంది భక్తులు దర్శించుకోగా 31,880 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.45 కోట్లు వచ్చిందని వారు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement