Sunday, May 5, 2024

కొత్త‌గా 20,038క‌రోనా కేసులు

క‌రోనా కేసులు మ‌ళ్ళీ పెరుగుతున్నాయి. కాగా దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 47 మంది కరోనాకు బలయ్యారని, 16,994 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతానికి చేరిందని పేర్కొన్నది. ఇప్పటివరకు 199.47 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement