Sunday, May 12, 2024

వరద బాధితులకు అండగా టీఆర్​ఎస్​.. పార్టీ లీడర్లు మరింత సేవ చేయాలన్న కేటీఆర్​

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు జులై నెలలోనే కురుస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వరదలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశంతో పార్టీ శ్రేణులన్నీ అండగా నిలుస్తున్నాయని, మరింతగా వరద బాధితులకు సేవ చేయాలని సూచించారు కేటీఆర్.

ఇట్లాంటి కష్ట సమయంలో తమ నియోజకవర్గాల్లోనే ఉండి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ నాయకులకి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వీరి ప్రయత్నాలు వలన ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయని, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల కార్యక్రమాలతో సమన్వయం చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement