Sunday, May 19, 2024

మహాపాదయాత్రలో ప్రత్యేక పూజలు

ఒంగోలు, ప్రభ న్యూస్‌ బ్యూరో : రాజధానిగా అమరావతినే కొనసాగించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 8వ రోజుకు చేరింది. కార్తీక సోమవారం సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న మహిళలు.. ప్రభుత్వానికి సద్బుద్ధి కలిగించాలని శంకరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంకొల్లులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రథం వద్ద ముగ్గులు వేశారు. ధూప,దీప, నైవేధ్యాలతో పూజలు చేశారు. అమరావతి రాజధానిని సాదిద్దామంటూ భజనలు చేశారు. న్యాయస్థానం నుంచి దేవ స్థానం వరకు చేపట్టిన అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని కోరుతూ మహిళా జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement