Wednesday, May 15, 2024

యాద్గిరి అండ్ సన్స్ వస్తున్నారు..

అనిరుధ్‌, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి అండ్‌ సన్స్‌’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘భీవ్లూ నాయక్‌’ దర్శకుడు సగర్‌. కె. చంద్ర చిత్ర -టైలర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో..హీరో అనిరుధ్‌ మాట్లాడుతూ ఇది నా డెబ్యూ చిత్రం. ఈ సినిమా రియల్‌ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కింది. అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయి. థియేటర్‌కి వచ్చి సినిమా చూసి వెళ్లేటప్పుడు.. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ఖచ్చి తంగా ఈ సినిమా ఇస్తుంది. అని తెలిపారు.
విలన్‌గా చేసిన రోహిత్‌ మాట్లాడుతూ ”ఈ సినిమాలో చూపించే ఇన్సిడెంట్స్‌ ప్రతి ఇంట్లో జరిగే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోగలం అనేది ఇందులో చూపించడం జరిగింది.” అని అన్నారు. సంగీత దర్శకుడు విజయ్‌ కురా కుల మాట్లాడుతూ. ”ఇది చిన్న సినిమా కాదు.. ఇంటిలిజెం ట్‌ మూవీ.” అని చెప్పారు. దర్శకుడు భిక్షపతి రాజు మాట్లా డుతూ.. ” ఈ సినిమాని నేను అనుకున్న విధంగా, అనుకున్న -టైమ్‌లో పూర్తి చేయడానికి సహకరించిన ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణు లందరికీ థ్యాంక్స్‌.” అని తెలిపారు.
‘భీవ్లూ నాయక్‌’ దర్శకుడు సాగర్‌ కె చంద్ర మాట్లా డుతూ.. ట్రైలర్‌ చూశాను. చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఏంటీ- ఇందులో కథ అని తెలుసుకున్నాను. ”అన్నారు. ఈ చిత్రం లో అనిరుధ్‌, యశస్విని, రోహిత్‌, జీవా , రాజీవ్‌ కనకాల, మ ధుమణి, నాగరాజ్‌, మోతీలాల్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement