Saturday, May 4, 2024

ఫిబ్రవరి 17 న వినరో భాగ్యము విష్ణుకథ

‘భలే భలే మగాడివోయ్‌’, ‘గీత గోవిం దం’, ‘ప్రతిరోజు పండగే’ వంటి సినిమాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్‌ నుండి వస్తున్న మరో మూవీ రానుంది. ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్‌. ఆర్‌ కల్యాణమండపం’ లాంటి సినిమాలతో ప్రేక్షకాదరణ పొందిన కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా రూపోందుతున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. హిట్‌, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ యంగ్‌ హీరో వరుస సినిమాలకు పచ్చ జెండా ఊపుతున్నాడు. ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం, కశ్మీర పరదేశి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘వినరో భాగ్య ము విష్ణు కథ’ షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

ఈ మూవీని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూర్చుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement