Sunday, April 28, 2024

బాలయ్య సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ను విశేషంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చెయ్యబోతున్నాడు.కాగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల క్రాక్ లో లేడీ విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి…నాంది లో లాయర్ గా మెప్పించింది. ఇక బాలయ్య సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement