Saturday, April 27, 2024

ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.

ఇక వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో పాన్ కాకుండా పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కించినన్నారట .అదే కనుక నిజమైతే ప్రభాస్ రేంజే మరికొంత పెరిగినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement