Friday, April 26, 2024

పోలీసు వాహనాలను తనిఖీ చేసిన ఎస్.పి

మహబూబ్ నగర్ : జిల్లా పోలీసుకు కేటాయించిన వివిధ రకాల వాహనాల కండిషన్ ను జిల్లా ఎస్.పి ఆర్,వేంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలన కండిషన్ మంచిగా ఉంచుకోవడంలో డ్రైవర్, మెకానిక్ లు శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రతిరోజూ వాహనాలను శుభ్రం చేసుకోవడంతో పాటుగా చిన్న సమస్య ఉన్నప్పుడే రిపేర్ పూర్తి చేసుకోవాలని చెప్పారు. ప్రయాణంలో డ్రైవర్లు జాగ్రత్తగా, చురుకుగా ఉండాలని ఎస్.పి ఇబ్బందికి సూచించారు. జిల్లాలోని అధికారుల వాహనాలు, పెద్ద వాహనాలు, పెట్రోలింగ్, బైకుల వివరాలను వాహనాల ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కుమార్ ఎస్.పి కి తెలిపారు. కరోనా నేపథ్యంలో వాహనాలను మరింత పరిశుభ్రంగా ఉంచుతున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను, డ్రైవర్లు, మెకానిక్ లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సురేష్, అప్పలనాయుడు, ఆర్.ఎస్.ఐ. రాజు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement