Monday, April 29, 2024

TS : మావోయిస్టు కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ

చిట్యాల, ఏప్రిల్ 24(ప్రభ న్యూస్) : మావోయిస్టు శంకర్ కుటుంబాన్ని మంత్రి సీత‌క్క ప‌రామ‌ర్శించారు. జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లంలోని చ‌ల్లగరిగ గ్రామానికి చెందిన మావోయిస్టు సుధాకర్ అలియాస్ శంకర్ చత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేడ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మృతి చెందాడు.

బుధ‌వారం మంత్రి సీత‌క్క భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావుతో క‌లిసి వెళ్లి ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. శంకర్ తల్లి రాజ పోచమ్మను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement