Saturday, May 4, 2024

ప్రేమ పేరుతో నయవంచన.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఓ యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తూర్పూగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో చోటు చేసుకుంది. చింతలూరు గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నేలపూడి సత్య నరేష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు.  దీంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, స్థానిక ఆమెను ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement