Sunday, April 28, 2024

ప్రేరణ చనిపోయే సీన్ హైలెట్ గా ఉంటుందట?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య గా ప్రభాస్ నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్ కు సంబంధించిన లైన్ లీక్ అయింది. క్లైమాక్స్ లో అద్భుతమైన ఎమోషనల్ సీన్ ఉంటుందట. ప్రభాస్ హెగ్డే ల మధ్య ఆ సీన్ ఉంటుందట. చివరిలో ప్రేరణ చనిపోతుందని… అయితే అది చూసిన విక్రమాదిత్య ఏడుస్తూ కనిపించే సన్నివేశం భావోద్వేగానికి గురి చేస్తుందని తెలుస్తోంది. మరి చూడాలి అది ఏ మేరకు ఉంటుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement