Sunday, May 12, 2024

అప్పుడే ఆట‌ల్లో మునిగిపోయింది.. కుమారై గురించి శ్రియా పోస్ట్

త‌న కూతురు అప్పుడే ఆట‌ల్లో మునిగిపోయింద‌ని న‌టి శ్రియా పోస్ట్ చేసింది. పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్ కి పంపడం ఎమోషనల్ మూమెంట్. ఆ క్షణాన్ని హీరోయిన్ శ్రియ సైతం అనుభవిస్తున్నారు. కూతురు రాధను స్కూల్ లో అడ్మిట్ చేశారు. శ్రియ భర్తతో కలిసి స్కూల్ కి వెళ్లారు. ఇక రాధ స్కూల్ అయిపోయాక కూడా ఇంటికి రావడం లేదట. స్కూల్ ఆవరణలో ఉన్న ప్లే జోన్ లో ఆటల్లో మునిగిపోయింది. శ్రియ కూతురిని ఇంటికి వెళదామని ఎంత బ్రతిమిలాడినా రావడం లేదు. అందరూ వెళ్లిపోయారు. మనం మాత్రమే ఉన్నాం, ఇంటికి వెళదాం అంటూ శ్రియ కూతురు రాధను బ్రతిమిలాడుతుంది. శ్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కూతురు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ని అభిమానులతో శ్రియ పంచుకున్నారు. 2021 జనవరి 10న శ్రియకు అమ్మాయి పుట్టింది. ఈ విషయాన్ని ఆమె 10 నెలల తర్వాత 2021 అక్టోబర్ లో తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement