Monday, May 13, 2024

సమీరా రెడ్డి పిల్లలకి కూడా కరోనా

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ స్టార్స్ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు సమీరారెడ్డి తెలిపారు. అయితే ఈ మహమ్మారి సమీరారెడ్డి పిల్లలకి కూడా సోకింది.

ఈ నేపథ్యంలోనే సమీర రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన పిల్లలు హన్స్ నైరా అస్వస్థతకు లోనయ్యారని నాలుగు రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని… ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని ఇంస్టాగ్రామ్ వేదికగా సమీరారెడ్డి పోస్ట్ చేశారు. అందరూ నిర్లక్ష్యం చేయకుండా.. జాగ్రత్తగా ఉండాలని కోరారు.

https://www.instagram.com/p/CN1PAZJHxeI/?igshid=16nyg8kynn4h

Advertisement

తాజా వార్తలు

Advertisement