Saturday, May 18, 2024

ఏపీని దేవుడే కాపాడాలి -24 గంటల్లో 27 మంది కరోనా తో మృతి

అమరావతి – ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాచుతుంది. గడిచిన 24గంట‌ల్లో 37,765మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా, 5963మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.మరోవైపు 27మంది ఈ మహమ్మారికి బలయ్యారు. అలాగే గడిచిన 24 గంటల్లో 2,569మంది కోలుకున్నారు. ఇక కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్య‌ధికంగా చిత్తూరులో 1,182కేసులు రాగా, గుంటూరులో 938కేసులొచ్చాయి. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,68,000 కి చేరుకుంది. అలాగే యాక్టివ్ కేసులు 48,053 ఉన్నాయి. మరోవైపు 9,12,510 మంది డిశ్చార్ కాగా రాష్ట్ర వ్యాప్తంగా7,437 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement