Saturday, April 27, 2024

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రిపబ్లిక్.. డేట్ ఎప్పుడంటే..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ న‌టించిన చిత్రం రిప‌బ్లిక్‌. దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో అక్టోబ‌ర్ 1న విడుద‌లైంది. ఐశ్వ‌ర్య రాజేశ్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీ విమర్శలకు ప్రశంసలు అందుకున్నా.. బాక్స్ ఆఫీస్ ముందు మాత్రం బోల్తా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో రాబోతోంది. రిప‌బ్లిక్ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. డిజిట‌ల్ స్ట్రీమింగ్ తేదీని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ-5 ప్ర‌క‌టించింది. ఈ నెల 26 నుంచి జీ5 యాప్‌లో రిప‌బ్లిక్ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిపింది.

కాగా, రిప‌బ్లిక్ సినిమా రిలీజ్ టైమ్ లో హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురై ఆస్ప‌త్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ ప్ర‌మోష‌న్ చేశారు. అయితే, సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement