Friday, May 10, 2024

నీట్ లో మెరిసిన ఊట్కూర్ ఆణిముత్యం.

ఊట్కూర్, (ప్రభా న్యూస్) మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి వై, మనీ వర్ధన్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నీటి పరీక్షల్లో తన ప్రతిభను చాటారు. ఊటుకూరు మండల కేంద్రంలోని అయోధ్య నగర్ కు చెందిన యంగల్ సుభాష్, భారతి దంపతుల కుమారుడు మనీ వర్ధన్ చిన్నతనం నుండి చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉంది. విద్యార్థి మనీ వర్ధన్ తాతయ్య యంగల్ శ్యామ్ రావు విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి కావడంతో తాత ఆశయ సాధన కోసం ఎంతో శ్రద్ధగా చదువుకొని సోమవారం వెలువడిన నీట్ పరీక్ష ఫలితాల్లో 720 మార్కులకుగాను 665 మార్కులు సాధించారు.

విద్యార్థి మనీ వర్ధన్ 6వ తరగతి నుండి 10 తరగతి వరకూ హైదరాబాద్ హబ్సీ గూడ లోని భాష్యం ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ చైతన్య కాలేజీలో చదివారు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని విద్యార్థి నిరూపించడం తో పలువురు అభినందిస్తున్నారు. విద్యార్థి ప్రతిభ కనపరిచడం పట్ల ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి , సింగిల్విండో చైర్మన్ బాల్ రెడ్డి సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, ఎంపీటీసీ హనుమంతు ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థిని అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement